డబుల్ ఇస్మార్ట్ మొదటి పాట జూలై 1న

June 29, 2024


img

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ పేరుతో సినిమాని సిద్దం చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 15వ తేదీన విడుదల చేస్తామని ముందే ప్రకటించారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున ఈ సినిమా నుంచి మొదటి పాటని జూలై 1వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. 

ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్యా థాపర్, విలన్‌గా బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. అలీ, గెటప్ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు పాటలు: భాస్కరభట్ల, సంగీతం: మణిశర్మ, కొరియోగ్రఫీ: జానీ మాస్టర్, కెమెరా: శ్యామ్ కె నాయుడు, జియాణీ జియానెల్లి చేస్తున్నారు. 

పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష