నాగ్ అశ్విన్, ప్రభాస్
కాంబినేషన్లో వచ్చిన కల్కి ఎడి2898 సినిమాలో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్ర
చేశారు. అయితే అశ్వథామగా నటించిన అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ప్రభాస్ కంటే ఎక్కువే ప్రాధాన్యం
లభించింది కానీ ఆ స్థాయి నటుడైన కమల్ హాసన్ పాత్ర మాత్రం తెరపై ఎక్కువ సేపు చూపకపోవడంతో
అభిమానులు నిరాశ చెందారు. అయితే ఈ సినిమా రెండో భాగం కోసమే కమల్ హాసన్ని పూర్తిగా
చూపకుండా దాచి ఉంచారని అందరూ ఊహించారు. వారి ఊహలు నిజమే అని కమల్ హాసన్ నేడు
చెప్పేశారు.
శుక్రవారం చెన్నైలో ఆయన ప్రేక్షకులతో కలిసి థియేటర్లో
కల్కి ఎడి2898 సినిమాని చూశారు. అంనంతరం మీడియాతో మాట్లాడుతూ,
“కల్కి ఎడి2898లో నా పాత్ర చాలా తక్కువ సేపు కనిపిస్తుందని,
కానీ రెండో భాగంలో ఎక్కువ సేపు ఉంటుందని నాగ్ అశ్విన్ ముందే చెప్పారు. ఒక సినీ
అభిమానిగా ఈ సినిమాలో నటించాను. నాగ్ అశ్విన్కు ఓపిక చాలా ఎక్కువ.
అందుకే పురాణేతిహాసాలను చాలా చక్కగా సైన్స్తో ముడిపెట్టి చక్కగా ఈ కధ
వ్రాసుకున్నారు. దానిని అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాతో భారతీయ
సినిమా గ్లోబల్ సినిమాగా మరింత ఎదిగిందని భావిస్తున్నాను,” అని కమల్
హాసన్ అన్నారు.