ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పఠానీ, దీపికా పడుకొనే ప్రధాన పాత్రలలో కల్కి ఎడి2898 నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. దీనిపై అటు సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డ్ సాధించిన దర్శకుడు రాజమౌళి కూడా ఈ సినిమాపై ప్రశంశలు కురిపించారు.
“కల్కి ఎడి2898లో ప్రపంచాల సృష్టించడం చాలా బాగుంది. వాటి కోసం వేసిన సెట్స్లో నన్ను వేరే లోకంలో తీసుకుపోయిన అనుభూతి చెందాను. డార్లింగ్ ప్రభాస్ తన టైమింగ్, అలవోకగా నటించిన తీరు మహాద్భుతం.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే సినిమాకి మూలస్థంభాలుగా నిలిచారు. చివరి 30 నిమిషాలు నన్ను వేరే లోకంలోకి తీసుకుపోయింది. ఈ సినిమాని ఇంత అద్భుతంగా వచ్చేందుకు ఎంతగానో కృషి చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ టీమ్కు నా అభినందనలు,” అని రాజమౌళి ట్వీట్ చేశారు.
ఇదే ప్రభాస్, ఇంకా అనేక మంది పెద్ద నటీనటులతో దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ తీసి నవ్వులపాలయ్యాడు. కానీ కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఆస్కార్ అవార్డ్ సాధించిన రాజమౌళి కూడా ప్రశంశించే అంత గొప్పగా కల్కి ఎడి2898 తీసి చూపారు. అంతేకాదు ఇకపై భారతీయ సినీ పరిశ్రమ హాలీవుడ్కు గట్టి పోటీ ఈయబోతోందని తేల్చేశాడు.