భద్రాద్రి విద్యుత్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

June 30, 2024
img

ఓ పక్క జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్‌ భద్రాద్రి, యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరుపుతుండగా శనివారం రాత్రి భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ కేంద్రంలోని ఒకటవ యూనిట్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. దీని వలన 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరుగలేదు కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిన్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేసిన తర్వాత అధికారులు ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించారు.

అగ్నిప్రమాదంలో పాడైన యంత్ర పరికరాల స్థానంలో మళ్ళీ కొత్తవాటిని అమర్చే పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదంపై భద్రాద్రి ప్లాంట్ ఉన్నతాధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయవలసి ఉంది.

Related Post