బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహించదు: బండి సంజయ్‌

June 30, 2024


img

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆదివారం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయట మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదు.

ఇదివరకు కేసీఆర్‌ ఈవిదంగానే చేసినప్పుడు కాంగ్రెస్‌ నేతలు తప్పు పట్టారు. ఇప్పుడు వారు కూడా కేసీఆర్‌లాగే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహించదు. మా పార్టీకి ఆ అవసరం కూడా లేదు,” అని అన్నారు. 

అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, గోడెం గణేశ్, సీతారాం నాయక్, బూర నర్శయ్యగౌడ్, బీబీ పాటిల్‌లను బీజేపీలో చేర్చుకుని వారినే అభ్యర్ధులుగా నిలబెట్టిందన్న సంగతి బండి సంజయ్‌ గుర్తులేన్నట్లు మాట్లాడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీతో కలిసి కూలద్రోయాలని కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారనే విషయం బండి సంజయ్‌కి తెలియదనుకోలేము. కనుక కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే నైతిక హక్కు బీజేపీకి కూడా ఉండదు కదా?


Related Post