సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం వరంగల్, హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. వర్షాకాలం మొదలైనందున వన మహోత్సవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని రేపు హనుమకొండలో ప్రారంభించనున్నారు.
మామునూరులో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున రేపటి పర్యటనలో సిఎం రేవంత్ రెడ్డి అధికారులతో దీనికి చేయవలసిన ఏర్పాట్ల గురించి చర్చించనున్నారు.
సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడు పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబందించిన అంశాలపై మాట్లాడి హామీలు పొందారు. వాటిలో స్మార్ట్ సిటీగా ఎంపికైన వరంగల్ నగరంలో భూగర్భ డ్రైనేజీ, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణాలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం తదితర అంశాల గురించి సిఎం రేవంత్ రెడ్డి జిల్లా అధికారులతో చర్చించనున్నారు.
కేసీఆర్ హయాంలో ఏర్పాటైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుని సిఎం రేవంత్ రెడ్డి రేపు సందర్శించవచ్చని సమాచారం. మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అవి నిజమైతే ఎర్రబెల్లి దయాకర్ రావు రేపు సిఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది.