గత ప్రభుత్వ హయాంలో టీజీపీఎస్ఎస్సీ ఉద్యోగాల భర్తీకి మొదలుపెట్టిన ప్రక్రియని అందరికీ తెలిసున్న వివిద సమస్యలు, కారణాల వలన పూర్తిచేయలేకపోయింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక టీజీపీఎస్ఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేయడంతో ఇప్పుడు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతోంది.
ఈ నెల 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించింది. త్వరలోనే వాటి ఫలితాలు ప్రకటించబోతోంది. గ్రూప్-1లో 563 ఉద్యోగాలకు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో సుమారు 3 లక్షల మంది మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారిలో ఒక్కో పోస్టుకి 50 మంది చొప్పున అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా మెయిన్ పరీక్షలకు ఎంపిక చేస్తున్నారు.
గ్రూప్-2లో 783 పోస్టులు, గ్రూప్-3లో 1,388 పోస్టులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్ఎస్సీ పరీక్షలు నిర్వహించబోతోంది. ఆ వివరాలు...
గ్రూప్-2 పరీక్షలు: ఆగస్ట్ 7,8.
గ్రూప్-1 మెయిన్ పరీక్షలు: అక్టోబర్ 21 నుంచి.
గ్రూప్-3 పరీక్షలు: నవంబర్ 17,18.